భారత్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 4,987 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో ఇదే గరిష్ఠం. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 90,927కి చేరింది.
24 గంటల్లో దేశంలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,872కి చేరింది. అలాగే, కరోనా నుంచి 34,109 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,946 మంది చికిత్స పొందుతున్నారు.