ఉత్తరప్రదేశ్ ఔరయలో నిన్న రెండు ట్రక్కులు ఢీకొని 25 మంది వలస కార్మికులు మరణించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. లాక్డౌన్తో సొంతూర్లకు వెళ్తున్న వలస కార్మికులు రవాణా సదుపాయాలు లేకపోవడంతో కాలినడకన కొందరు, సైకిళ్లతో, లారీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వలస కార్మికుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రాభుత్వం ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది.
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఏ ఒక్క వలస కార్మికుడు కూడా కాలినడకన, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై ప్రయాణాలు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రహదారుల వెంట వెళ్తున్న వలస కార్మికులను బస్సుల్లో ఎక్కించుకుని, వారు వెళ్లాల్సిన ప్రాంతాల్లో దించేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బస్సు డైవర్లు, కండక్టర్లకు మార్గదర్శకాలు జారీచేశామని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజ్ శేఖర్ వెల్లడించారు.