telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేను ఏ తప్పు చేయలేదు..ఎవరికీ భయపడను: చంద్రబాబు

chandrababu

జగన్ సర్కారు శాశ్వతం కాదనే నిజాన్ని పోలీసులు గ్రహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మైనింగ్ గనులను ఇచ్చిన వ్యక్తి జగన్ సలహాదారుడిగా ఉన్నారని విమర్శించారు.జగన్ తండ్రి తనపై 26 కేసులు వేశారని, అయినా సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.నేను ఏ తప్పు చేయలేదని…అందుకే ఎవరికీ భయపడనని ఉధ్గాటించారు.

పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరిచిపోనని… కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుగా పెడతానని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రజల ఆశీస్సులు పొందాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.ఇకపై పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులను కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని అన్నారు.

Related posts