telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగించిన క‌ర్ణాట‌క‌…

ప్రస్తుతం మన దేశంలో కరోనా భారీగా నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. దాంతో క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది కర్ణాటక ప్ర‌భుత్వం.. ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు ఈనెల 24తో ముగియ‌నుండ‌గా.. జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్ర‌క‌టించారు.. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించిన నేపథ్యంలో మరో 14 రోజులు లాక్‌డౌన్ పొడిగించిన‌ట్టు వెల్ల‌డించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం.. ఆ త‌ర్వాత లాక్‌డౌన్‌పై ప్ర‌క‌ట‌న చేశారు.. ఈ స‌మ‌యంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ప్రజలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తామని తెలిపారు.. లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Related posts