ఐపీఎల్-2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తున్న బీసీసీఐ.. అందుకోసం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని… ఒక్కో టెస్టు షెడ్యూల్లో మార్పు చేసి కనీసం వారం ముందుగా సిరీస్ ముగించాలని ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేసిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఈసీబీ స్పందించింది. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని ఈసీబీ అధికార ప్రతినిధి క్రిక్బజ్కు తెలిపారు. ‘బీసీసీఐతో తరుచూ మేం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. కరోనా వైరస్ సవాళ్లను అధిగమిస్తూ ఎలా ముందుకు సాగాలనేదాని సుదీర్ఘంగా చర్చిస్తున్నాం. అయితే టెస్ట్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని ఇప్పటి వరకు బీసీసీఐ తమను కోరలేదు. అసలు ఈ సిరీస్కు సంబంధించిన ప్రస్తావనే రాలేదు’అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్ల నిర్వహణకు యూకే ఫస్ట్ చాయిస్ వేదికగా బీసీసీఐ భావిస్తోంది. ‘టెస్ట్ సిరీస్లో మార్పులు చేయడానికి ఈసీబీ అంగీకరిస్తే మాత్రం ఐపీఎల్ తమ దేశంలోనే జరగాలని ఇంగ్లండ్ కోరుకుంటుంది. ఎందుకంటే లీగ్ వల్ల ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇరు బోర్డులకు ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా ఐపీఎల్ను పూర్తి చేయడం బీసీసీఐ తొలి ప్రాధాన్యత కానుంది.
previous post
next post
కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ