telugu navyamedia
రాజకీయ వార్తలు

నీతిఆయోగ్ సమావేశానికి ముగ్గురు సీఎంలు గైర్హాజర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న 5వ నీతిఆయోగ్ సమావేశానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టనున్నారు. ఈ సమావేశంలో వర్షపునీటి నిల్వ, కరవు పరిస్థితులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఉగ్రవాదంపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు.

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ తోపాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావులు నీతిఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదు. నీతి ఆయోగ్ సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం లేనందున తాను ఆ సమావేశానికి రావడం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహాల్లో ఉండటంతో ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. పంజాబ్ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ కూడా నీతి ఆయోగ్ సమావేశానిక హాజరు కావడం లేదు.

Related posts