అహ్మదాబాద్లో నేడు జరిగే పింక్ బాల్ టెస్టుతో తన 100 వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న ప్రముఖ బౌలర్ ఇషాంత్ శర్మను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. మరియు ఇంత పెద్ద కెరియర్ కు ఇషాంత్ పూర్తి అర్హుడని చెప్పాడు. ఇషాంత్ శర్మ తన కెరీర్ను పొడిగించుకోవడానికి వైట్-బాల్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వలేదని, అయితే టెస్ట్ క్రికెట్కు ప్రాముఖ్యత ఇచ్చినందుకు అతడిని నేడు ప్రశంసించానని కోహ్లీ చెప్పాడు. “ఈ రోజుల్లో పేసర్కు ఇన్ని ఎక్కువ రోజుల కెరియర్ ఉండటం చాలా అరుదు. ఇషాంత్ సులభంగా వైట్-బాల్ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వగలడు, కాని అతను ఇవ్వలేదు. అతను తన 100వ టెస్ట్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఈ మ్యాచ్ లో అతను అద్భుతాలు చేస్తాడు అని ఆశిస్తున్నాను అంటూ విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశంలో అన్నారు. దేశీయ వైట్-బాల్ పోటీలలో మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నప్పటికీ, ఇశాంత్ను వైట్-బాల్ స్పెషలిస్ట్గా భావించలేదు. అయితే ఇషాంత్ చివరిసారిగా 2016 లో భారత్ తరఫున వన్డే లో , 2013 లో టీ 20 లో ఆడాడు. ఇక భారత్ తరపున 100 టెస్ట్ ఆడుతున్న రెండవ పేసర్ ఇషాంత్. అతని కంటే ముందు కపిల్ దేవ్ ఉన్నాడు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాశనం చేసింది: యనమల