telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ

KVP comments Polavaram project

పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకునే కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడినని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ అన్నారు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకురావడంలో తాను కీలకంగా పనిచేశానని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తే, ఏపీ మంత్రి దేవినేని ఉమతో పాటు పోలవరంపై ఓనమాలు కూడా తెలియని పండిత పుత్రులు తనను విమర్శిస్తున్నారని అన్నారు.

పార్టీ హైకమాండ్ ఆదేశించగానే తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం ఉందో చదవి స్పందించి ఉంటే బాగుండేదని ఘాటు కేవీపీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్య్వహారం పై కేవీపీ ఈరోజు టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. దేవినేని ఉమ కూడా తన లేఖలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని కేవీపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ తీసుకోవడం ద్వారా ఎంత భారం రాష్ట్రంపై పడుతుందో ఉమ వివరణ ఇవ్వలేదని అన్నారు.

Related posts