telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆనందయ్య ఆయుర్వేదంలో ఎలాంటి ఇబ్బంది లేదు…

ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జ‌రుగుతోంద‌న్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జ‌రిపామ‌న్న ఆయ‌న‌.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం ఆయుష్ బృందం కృష్ణపట్నం వెళ్తుంద‌ని చెప్పారు. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ ఆయుష్ కమిషనర్ కృష్ణ‌ప‌ట్నం వెళ్లిన విష‌యాన్ని వెల్ల‌డించిన సింఘాల్.. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో ఆనందయ్య ఆయుర్వేదం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెబుతున్నార‌ని తెలిపారు.. హానికారకాలు ఉన్నట్టు తేల‌లేద‌ని.. అయితే, శాస్త్రీయపరంగా మరింత అధ్యయనం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ ఏ విధంగా చేస్తున్నార‌నేది రేపు డిమానిస్ట్రేషన్ చేయబోతున్నార‌న్న ఆయ‌న‌.. కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు వినియోగం.. కరోనా కేసుల నమోదుపై కూడా అధ్యయనం జ‌రుగుతుంద‌న్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts