telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కంగనా రనౌత్ తలైవి ట్రైలర్ విడుదల…’

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమాను చేస్తోంది. ఈ సినిమాలో కంగనా లీడ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ తర్వాత మళ్ళీ థియేటర్లు తెరుచుకోవడంతో తలైవి రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కంగనా జయలలితగా అభిమానంబులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామీ నటించగా ప్రకాష్ రాజ్, మధూ, జిష్షు సేన్‌గుప్త తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణకు చాలా సమయం తీసుకున్న విడుదలకు మాత్రం హడావిడీ చేస్తున్నారు. ఈ సినిమాను వాస్తవానికి గతేడాది విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి.అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts