telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పెరగనున్న హ్యూందాయ్ కార్ల ధరలు!

hundai cars

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ ఇండియా అన్ని మోడళ్లపై వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. కార్ల తయారీకి కావాల్సిన ముడి సరుకుల ధరలు పెరగటంతో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ధరల పెరుగుదల ఎంత మేరకు ఉంటుందన్నది స్పష్టం చేయలేదు.

ఈ మేరకు కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. దేశంలోనే తొలి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ అందజేస్తున్న హ్యూందాయ్ మోటార్స్ ఇండియా జనవరి 2020 నుంచి అన్ని మోడళ్లపై ధరలను పెంచుతోంది. ముడిసరుకుల ధర పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Related posts