telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఫ్లిప్ కార్ట్ లో .. మొబైల్ బొనాంజా.. సేల్ .. ఐదు రోజులు..

mobile bonanza in flipkart

ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరోసారి మొబైల్ బొనాంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. ఇందులో భాగంగా భారీ స్మార్ట్ ఫోన్లకు డిస్కౌంట్లు ప్రకటించింది. కొన్ని బ్యాంకుల కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి అదనపు డిస్కౌంట్లు కూడా ఇస్తామని పేర్కొంది.

ఈ బొనాంజా లో రూ. 19,999 ఎంఆర్పీతో ఉన్న పోకో ఎఫ్‌‌1 స్మార్ట్ ఫోన్‌.. రూ.17,999లకే అందించనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. 6జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ ఉన్న ఈ ఫోన్ రూ.3,000 ఎక్స్చేంజ్‌ ఆఫర్‌‌లో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అదేవిధంగా, మోటరోలా వన్‌ పవర్‌ 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ను రూ. 13,999కే అందిస్తామని, ఎం2- 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఫోన్‌పై రూ. 3 వేలు డిస్కౌంట్ ఇస్తూ, రూ.11,999కే అందించనుంది.

Related posts