telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ లాంగ్ మార్చ్ ఎందుకు చేశారో ప్రజలకు అర్థం కాలేదు: మంత్రి కొడాలి

kodali nani ycp

ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న విశాఖలో లాంగ్ మార్చ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మద్దతుతో పవన్ లాంగ్ మార్చ్ ఎందుకు చేశారో ప్రజలకు అర్థం కాలేదని పేర్కొన్నారు. లాంగ్‌ మార్చ్‌లో వరదల్లో ఇసుక ఎలా తీస్తారో అనే టెక్నాలజీ గురించి చెప్తారేమో అని ఎదురు చూశామన్నారు. 

జనంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే లాంగ్‌మార్చ్‌కి అన్ని పార్టీలను జనాల్ని పంపమని ఎందుకు అడిగారని ప్రశ్నించారు.ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని కూడా పవన్ సరిగా చదవలేకపోయారని విమర్శించారు. వేదికల మీద అర్థం లేకుండా ఊగిపోతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనం అసహ్యించుకుంటారని అన్నారు.

Related posts