ఏపీ ఎన్నికల ఫలితాల పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తొలిసారిగా స్పందించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరెన్ని ఎంక్వయిరీలు చేసుకున్నా భయపడమని అన్నారు. పడి లేచిన సముద్ర కెరటాన్నే మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్న స్వామి వివేకానంద సూక్తిని ఆచరించాలని కార్యకర్తలకు దేవినేని సూచించారు.
ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. చంద్రబాబుకు కూడా గెలుపు ఓటములు కొత్తేం కాదన్నారు. 20 సంవత్సరాల క్రితం కార్యకర్తల ఉన్నానని ఇప్పుడు కూడా అలాగే పని చేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానాన్నారు. కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోయి విజయం వచ్చినప్పుడు ఆనందపడటం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియదన్నారు.
రాయలసీమ ముఠా నాయకుడిలా నరేంద్ర మోడీ: జేసీ