మహా నటుడు , నాయకుడు , స్వర్గీయ నందమూరి తారక రామా రావు 96 వ జయంతి సందర్భంగా ఆ మహానేత జన్మించిన కృష్ణా జిల్లాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్య మంత్రి వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటిస్తున్నారని తెలిసింది . జగన్ మోహన్ రెడ్డి తన పాద యాత్ర కృష్ణా జిల్లాలో వున్నప్పుడే ఈ విషయం ప్రకటించారు .
ఈ నెల 30 న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో అదే వేదికపై ప్రకటిస్తారని తెలుస్తుంది . జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయవాడ కూడా కృష్ణా జిల్లాలో వుంది . నందమూరి కుటుంబాన్ని ఆనంద పరిచే ఈ వార్త తెలుగు దేశ నాయకులకు మాత్రం మింగుడుపడటం లేదు . ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు దేశం . రామారావు పేరు చెప్పుకొనే ఈ పార్టీ మానుగడ సాగిస్తుంది .
ఇప్పుడు ఈ క్రెడిట్ జగన్ మోహన్ రెడ్డికి వస్తుంది . అంతేకాదు కమ్మ వారందరినీ సంతృప్తి పరిచే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటిస్తున్నారని తెలుస్తుంది . తెలుగు దేశానికి క్రమంగా ఎన్టీఆర్ ను దూరం చెయ్యడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది .
– భగీరథ