తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ముఠా నాయకుడిలా నరేంద్రమోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోడీ అసమర్థ ప్రధాని అని విమర్శించారు. ప్రధానిగా ఉండి అసత్యాలు మాట్లాడటానికి సిగ్గు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రానికి దుష్టశక్తి అయితే నేడు బీజేపీ దేశానికే దుష్టశక్తి అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, జగన్ను కూడా మిత్రుడ్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు మేకై కూర్చుంటాడని మోడీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
లోకేశ్ ఓటమికి చంద్రబాబే పరోక్ష కారకులు : ఆళ్ల రామకృష్ణారెడ్డి