telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం!

corona vairus

ఏపీలో మొన్నటివరకు విర్జుంభించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 76,000 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,855 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి అత్యధిక కేసులు వచ్చాయి. ఈ జిల్లాలో 1,095 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,385కి చేరింది.

రాష్ట్రంలో మరో 51 మరణాలు సంభవించగా, మొత్తం మృతుల సంఖ్య 5,558కి చేరింది. ఇక, గడచిన 24 గంటల్లో 8,807 మందికి కరోనా నయం అయింది. దాంతో ఇప్పటివరకు మొత్తం 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 69,353 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts