గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు రైతుల కోసమే పనిచేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీటర్లు కావాలనుకుంటే బీజేపీకి, మీటర్లు వద్దు అనుకుంటే టీఆర్ఎస్ కారుకు ఓటేయాలని అన్నారు.
కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా నిలిచిపోలేదని స్పష్టం చేశారు.రైతుల కోసం టీఆర్ఎస్ సర్కారు ఎంతో చేసిందని, కానీ బీజేపీ రైతులకు మేలు చేయకుండా బాంబులు వేస్తోందని విమర్శించారు. బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసి, బిల్ కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఓట్ల కోసం వచ్చే వారెవరో, పనిచేస్తున్నది ఎవరో ప్రజలు గుర్తించాలని తెలిపారు.
సీఎంకు అధికారాలు లేవని సీఎస్ ఎలా అంటారు: రాజేంద్రప్రసాద్