telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 4న పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన

Pawan-Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండ మీదుగా భీమవరం వెళతారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. ఆ మరుసటి రోజు నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

Related posts