telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అమీర్ పేట తహసీల్దార్ కు కరోనా పాజిటివ్

Corona

హైదరాబాదు నగరంలో కరోనా దూసుకుపోతోంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా అమీర్ పేట తహసీల్దార్ చంద్రకళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అంతేకాదు, కార్యాలయంలోని సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేశారు.

జీహెచ్ఎంసీ సిబ్బందిలోనూ కరోనా బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రధాన కార్యాలయంతో పాటు ప్రాంతీయ, ఉప కార్యాలయాల్లోనూ కరోనా జోరు కనిపిస్తోంది. కింది స్థాయి సిబ్బందితో పాటు ఆయా శాఖల అధికారులకు సైతం కరోనా నిర్ధారణ అవుతుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts