ప్రస్తుతం దేశం మొత్తం నెల్లూరు ఆనందయ్య కరోనాకు తయారు చేసిన ఆయుర్వేద మందు గురించి మాట్లాడుకుంటుంది. అయితే ప్రస్తుతం ఆయన తయారు చేస్తూ.. కరోనా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలో పడిపోయారు అధికారులు.. ఇదే సమయంలో.. ఆనందయ్యను అరెస్ట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కృష్ణపట్నంలో ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్.. వివరణ ఇస్తూ.. ఆనందయ్యను అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనకు అదనపు భద్రత కల్పించామని వెల్లడించారు.. మరోవైపు.. ఈ ప్రచారంపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు.. కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న బొణిగి ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం, కేవలం వదంతులు మాత్రమే అని పేర్కొన్నారు.
previous post
మోదీ విమర్శల పై స్పందించిన మాయావతి