మరోసారి దేశరాజధాని నగరం ఢిల్లీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్న సూట్కేసు కలకలం సృష్టించింది. ఓ ఆటోడ్రైవర్ మంగళవారం తన ఆటోలో వెళ్తుండగా పశ్చిమఢిల్లీలోని కొండ్లి కెనాల్ వద్ద ఉన్న రోడ్డుకు సమీపంలో సూట్కేసును గుర్తించాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ సూట్కేసును తెరిచిచూడగా..అందులో మహిళ మృతదేహం కనిపించింది. ఆ మహిళ చేతిపై మోహిత్ అనే పేరుతో టాటూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. మహిళ మృతి కేసుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఘజియాబాద్లో ఓ గర్భిణీ మహిళను చంపి..సూట్కేసులో పెట్టిన కేసులో భార్యభర్తలిద్దరినీ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో ఘటన అదేమాదిరి జరగటంతో ఇంకోసారి రాజధాని ఉలిక్కిపడింది.
వాళ్ళు కేవలం పడకసుఖం కోసమే… కాస్టింగ్ కౌచ్ పై రాయ్ లక్ష్మీ షాకింగ్ కామెంట్స్