telugu navyamedia
రాజకీయ వార్తలు

97 శాతం లంబాడాలే అనుభవిస్తున్నారు: ఎంపీ సోయం

soyam bapu rao

ఎస్టీ రిజర్వేషన్ ను 97 శాతం లంబాడాలే అనుభవిస్తున్నారని ‘తుడుందెబ్బ’ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. . సోమవారం దేశరాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన ‘ఆదివాసీ అస్తిత్వ పోరాట సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ 1976 ఎమర్జెన్సీ కాలంలో నిబంధనలను తుంగలో తొక్కి లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. ఈ కారణంగా ఆదివాసీ యువత విద్య ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోతోందని, ఆదివాసీల భవిష్యత్ కు ఇది భంగకరమైని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులను కాపాడటానికి కేంద్రం తగిన రీతిలో స్పందించాలని, ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడాలను తొలగించడం ద్వారా ఆదివాసీలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆర్టికల్ 342 ప్రకారం సుగాలీలు, లంబాడా కులాలకు చట్టబద్థత లేదని, అయినా తెలంగాణలో వారు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే వివిధ రాష్ట్రాల నుంచి లంబాడాలు తెలంగాణకు వలస వస్తున్నారుని అన్నారు. ఒకప్పుడు 1 లక్షా 20 వేలు ఉన్న వారి జనాభా ఇప్పడు 20 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

Related posts