telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రియురాలితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు…

suicide

హైదరాబాద్‌లోని అల్వాల్‌ దారుణం చోటు చేసుకుంది. అల్వాల్ భూదేవి నగర్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వంశీ కృష్ణ అనే యువకుడు.. ప్రేమించిన యువతి చిత్రాన్ని అతని ఛాతీపై టాటూ వేయించుకున్నట్టుగా తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ చిలకలగూడలోలో నివాసం ఉండే వంశీ కృష్ణకు అల్వాల్‌లో ఉండే ఓ యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది.. సికింద్రాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేసే ఆ యువతి, వంశీకృష్ణ మధ్య ప్రేమవ్యవహారం కొంతకాలం బాగానే నడిచింది.. అయితే, ఉన్నట్టుండి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి… తాజాగా, ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దదైనట్టుగా చెబుతున్నారు.. దీంతో.. మనస్తాపానికి గురైన వంశీకృష్ణ.. ఆత్మహత్యకు పాల్పడ్డారు.. నిన్న బాలాజీనగర్ లో స్నేహితులతో గడిపిన అనంతరం ఇంటికి వెళ్లిన ఆ యువకుడు.. ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయాడు.. అనంతరం రైలు పట్టాలపై శవమై తేలాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు. అయితే ఈ ఘటన పై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Related posts