telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు చుక్కలనంటిన తరుణంలో లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉల్లిపాయల కోసం రైతుబజార్ క్యూలైన్లో నిలబడ్డ సాంబయ్య మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావించారు.

పేద ప్రజలపై జగన్ కు అంతకక్ష ఎందుకో? జగన్ అసమర్థ పాలన కారణంగా ఉల్లి కోసం సామాన్యులు అల్లాడుతున్నారని, ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని మండిపడ్డారు. క్యూలైన్లలో ప్రభుత్వ హత్యలు ఆపాలని మండిపడ్డారు. వైసీపీని గెలిపిస్తే అన్నీ డోర్ డెలివరీ చేయిస్తానన్న జగన్, కనీసం ఉల్లిపాయల నైనా డోర్ డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు.

Related posts