ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తమ్మినేని కలిసినట్టు తెలుస్తోంది. కాగా, ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తమ్మినేని గెలుపొందారు. కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ్మినేని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు వైసీల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు స్పీకర్ ఎన్నిక పై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను నియమించే అవకాశం ఉంది.