telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర: సోము వీర్రాజు

Somu-Veerraju bjp

బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతోందని అన్నారు.

2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పని చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నవి కుటుంబ పార్టీలని, వాటికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందన్నారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు.

Related posts