ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లో సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు రాగానే, రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు తనకు డిప్యూటీలుగా ఉంటారని జగన్ ప్రకటించగా వారు ఎవరన్న చర్చ ఊపందుకుంది.
ఇక సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ వర్గం నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎస్టీ వర్గం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, బీసీ కులాల నుంచి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అక్రమ కేసులతో కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి