తెలంగాణ సీఎం కేసీఆర్ అక్రమ కేసులతో ప్రజా సంఘాల నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అహంకారం వైఖరిని ప్రజలు వ్యతిరేకించారని అన్నారు.
అందుకే తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెప్పారని అన్నారు. తెలంగాణలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ విజయం సాంధించదని తెలిపారు. మజ్లిస్ పార్టీని కేసీఆర్ నమ్ముకున్నాడని విమర్శించారు. విజయానికి అహర్నిశల్లు కష్టపడ్డ పార్టీ శ్రేణులకు, తమకు ఓటువేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.