telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్లాస్మా దానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే కిలారి

Kilari Rosaiah YSRCP

పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన ప్లాస్మా డోనార్ సెల్ ను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొట్టమొదటగా ఎమ్మెల్యే రోశయ్య ప్లాస్మాను దానం చేశారు. ఈ సందర్భంగా కిలారి రోశయ్య మాట్లాడుతూ ప్లాస్మాను దానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కరోనా బాధితులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తోందని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న 18 నుంచి 50 ఏళ్ల లోపు పురుషులు ప్లాస్మా ఇచ్చేందుకు అర్హులని చెప్పారు. అందరూ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎన్నారై ఆసుపత్రిలో కూడా ప్లాస్మా థెరపీని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Related posts