telugu navyamedia
క్రీడలు వార్తలు

వన్డే, టీ 20 జట్లను ప్రకటించిన ఆస్ట్రేలియా…

india-australia first odi

భారత జట్టుకు ఐపీఎల్ తర్వాత ఆసీస్ ఆతిధ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భారత్-ఆసీస్ మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతాయి. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే మూడు ఫర్మాట్లలో ఆడబోయే భారత జట్లను ప్రకటించింది. ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తమ వన్డే, టీ 20 జట్లను ప్రకటించింది. కానీ ఇంకా టెస్ట్ జట్టును మాత్రం ఎంపిక చేయలేదు. అయితే ఒక్క ఛేంజ్ కూడా లేకుండా ఈ రెండు ఫార్మాట్స్ కోసం ఒక్కే జట్టును ఎంపిక చేసిన సీఏ. ఐపీఎల్ లో గాయపడిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కు ఈ రెండు జట్లలో చోటుదక్కలేదు. ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఈ రెండు జట్లకు పాట్ కమ్మిన్స్ వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. నవంబర్ 27 న సిడ్నీలో వన్డే మ్యాచ్ తో ఈ పర్యటన ఆరంభం అవుతుంది. డిసెంబర్ 4 నుండి మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం అవుతుంది.

ఆసీస్  జట్టు : ఆరోన్ ఫించ్ (c), సీన్ అబోట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమ్మిన్స్(vc), కామెరాన్ గ్రీన్, జోష్ హాజెల్వుడ్, మొయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

Related posts