అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ ఉగ్రవాదం(ఐఎస్ఐఎస్) అంతమైనట్లు ప్రకటించారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న సిరియా, ఇరాక్లోని ప్రాంతాలు నూరు శాతం విముక్తి పొందినట్లు తెలిపారు.. వచ్చే వారం ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. కాలిఫా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
దీనిపై అధికారికంగా ప్రకటన చేసేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి వస్తుందన్నారు. కూటమి దేశాలతో జరిగిన భేటీలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత రెండేళ్లలో అమెరికా మిత్రదేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న సుమారు 20వేల చదరపు మైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.