telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బీజేపీ నేత సీఎం రమేశ్ కు కరోనా..ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్

bjp cm ramesh

కరోనా వైరస్ అన్ని రంగాలవారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారి భారీనపడుతున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన స్వయంగా వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు.

రమేశ్ కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కూడా కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Related posts