కడప జిల్లాలో కారును రైలింజన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలైనాయి. ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్ కు వెళ్లే రైల్వే ట్రాక్ లెవెల్ క్రాసింగ్-3 వద్ద ఈ ప్రమాదం జరిగింది.
కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్ మీద ఆగిపోయింది. అదే సమయంలో ఓ రైలింజన్ వచ్చి కారును దాదాపు 200 మీటర్లు లాక్కెళ్ళింది. ఆ సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు: రేవంత్రెడ్డి