బర్త్ డే పార్టీకీ గర్ల్ ఫ్రెండ్ ను హోటల్ కు పిలిచి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ విషాద సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలిని ఢిల్లీలోని కేరా కలాన్ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పుట్టినరోజు వేడుకను జరుపుకునేందుకు నిందితుడు, సదరు మహిళ ఇరువురు కలిసి ఓయో హోటల్ రూంలోకి వెళ్లారు.
గదిలో ఇరువురు మద్యం సేవిస్తుండగా ఏదో చిన్న విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సదరు వ్యక్తి మహిళ గొంతుపై బలంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ స్థితిలో ఆమెను చూసిన వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. మంగళవారం ఉదయం హోటల్ సిబ్బంది చూసి పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.