telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేషన్‌ కార్డు లబ్దిదారులకు శుభవార్త.. ఇక ఎక్కడినుంచైనా సరుకులు!

Ration Shop Telangana

తెలుగు రాష్ట్రాల్లోని రేషన్ కార్డు లబ్దిదారులకు పభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోగలిగే వెసులుబాటును కల్పిస్తూ “పోర్టబిలిటీ” విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ కొత్త కార్డు విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

హైదరాబాద్ లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో “వన్ నేషన్ – వన్ రేషన్” కార్డు విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ-ఏపీ క్లస్టర్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సేవలందుతాయని, ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. అయితే ఆహార భద్రతా చట్టం కింద జారీ చేసిన కార్డులకు మాత్రమే ఈ పోర్టబిలిటీ విధానం వర్తిస్తుంది.

Related posts