telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్టికల్ 370 రద్దుతో అట్టుడికిపోతున్న పాక్.. భారత్ వైపు నడిచే రైలు రద్దు

Surgical Strike 2Pakistan Indian air space

జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ అట్టుడుకిపోతుంది. భారత్-పాక్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును ఇప్పటికే నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా, భారత్ వైపు నడిచే మరో ఎక్స్ ప్రెస్ రైలు ను నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

పాకిస్థాన్ లోని తార్ పార్కర్ జిల్లాలో ఉన్న ఖోక్రాపార్ నుంచి భారత్ లోని మునాబా (రాజస్థాన్) వరకూ నడిచే ‘థార్’ వీక్లీ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. తాను పాక్ రైల్వేమంత్రిగా ఉన్నంత వరకూ ఇరు దేశాల మధ్య ఏ ఒక్క రైలు నడవదని రషీద్ తెలిపినట్టు సమాచారం.

Related posts