telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్‌తో డీజీపీ సవాంగ్‌ భేటీ

jagan ys

ఏపీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నూతన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వీరి  భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతలపై  ముఖ్యమంత్రితో చర్చించారు. గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ఏపీ డీజీపీగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. డీజీపీతో పాటు  పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా సీఎంతో సమావేశం అయ్యారు. 

 ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతారు. అలాగే నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. 

Related posts