మహిళపై లైంగిక వేధింపులకు దిగిన అమరావతి ఎస్సై రామాంజనేయులుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన చెందిన ఓ జంట సోమవారం అమరావతిలోని ఓ లాడ్జిలో దిగింది. సమాచారం అందుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు వ్యక్తిగత వాహనంలో డ్రైవర్ సాయికృష్ణతో కలిసి లాడ్జికి చేరుకుని వారిని పట్టుకున్నాడు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని వారిని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
డబ్బుల కోసం యువకుడిని ఎస్సై ఏటీఎంకు పంపాడు. అతడు వెళ్లగానే ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించాడు. ఏటీఎం నుంచి యువకుడు వచ్చిన తర్వాత వారి నుంచి వివరాలు తీసుకుని వదిలిపెట్టాడు. ఎస్సై తీరుపై బాధితులు మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావుకు చేరవేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు.
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా