ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ రాఖీ పంపారు. గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా రాఖీ పంపుతున్న పాక్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం రాఖీ పంపారు. మోదీ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు తెలిపారు. తన భర్త, కుమారుడు కూడా మోదీని అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు.
ట్రిపుల్ తలాక్పై మోదీ తీసుకున్న చర్యను కమర్ ప్రశంసించారు. మోదీ తప్ప మరెవరూ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అన్నారు. వచ్చే ఐదేళ్లు మోదీకి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. మోదీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని చెప్పుకొచ్చారు. మోదీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కొనియాడారు.
హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టొద్దు.. జగన్ పై పురందేశ్వరి ఫైర్!