టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అమరావతిలో టీడీపీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ తమ హయాంలో పథకాల అమల్లో ఎక్కడా వివక్ష చూపలేదని అన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసేశారని మండిపడ్డారు. రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి , బందరు పోర్టు పనులు నిలుపుదల చేశారని మండిపడ్డారు.
గిరిజనులకు ప్రత్యేక పంచాయతీల ఏర్పాటుకు నాంది పలికామని, కరవు జిల్లా అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చామని చెప్పారు. నలభై ఐదు ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, మాట తప్పిందని మండిపడ్డారు. తమ హయాంలో ఒకటో తేదీన కచ్చితంగా పింఛన్ ఇచ్చే వాళ్లమని, ప్రస్తుతం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి అని విమర్శించారు.
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !