telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం వీధి రౌడీలా మాట్లాడుతున్నారు.. జగన్ పై ఎమ్మెల్సీ బచ్చుల ఫైర్!

ఏపీసీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. కొత్త ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజాప్రయోజనాల కంటేవ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రశ్నార్ధకంగా మారిందని.. పోలవరం దగ్గర సముద్రంలో కలిసే నీరు తీసుకోకుండా, కొత్త విధానాలు మాట్లాడుతున్నారని జగన్‌పై విమర్శలు గుప్పించారు.

పదివేల కోట్ల రూపాయలతో అవినీతి చేసి అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. దొంగ మాదిరి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఉందని బచ్చుల సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలవరం నిర్మాణంపై సీఎం కేసీఆర్ వేసిన కేసు అలాగే ఉంది. కేసీఆర్‌తో చీకటి ఒప్పందం చేసుకుని నిధులు మళ్ళిస్తున్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాగే ఉంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Related posts