మెగాస్టార్ చిరంజీవి మంచువారింట్లో సందడి చేశారు. మంచు విష్ణు నివాసంలో ఏర్పాటు చేసిన దీపావళి సెలబ్రేషన్స్కు ఆయన హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో హీరో ప్రభాస్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్పై చిరంజీవితో ఖైదీ నెంబర్-150, సైరా నరసింహారెడ్డిని రూపొందించారు.