telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ వ్యాక్సిన్… దేశానికే గర్వకారణం : తమిళిసై

హైదరాబాద్ కొవిడ్ వ్యాక్సిన్ దేశానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. తాను వ్యాక్సిన్ తీసుకోలేదని.. మొదట ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్న ప్రధాని సూచన మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తాను ప్రజలతో పాటు తీసుకుంటానన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు స్వయం సమృద్ధ భారత్‌ను చూస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ వ్యాక్సిన్ ఎండింగ్ ఆఫ్ కొవిడ్ అన్నారు. థాంక్యూ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ పరిశోదనలను ప్రోత్సహించారన్నారు. ఏ దేశంపై ఆధారపడాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.140 కేంద్రాల్లో 30 మంది చొప్పున వ్యాక్సిన్ ఇస్తున్నారని, సోమవారం నుంచి వ్యాక్సిన్ డోసులు పెరుగుతాయన్నారు. వ్యాక్సిన్స్ సురక్షితమైనదని, 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వరల్డ్ లార్జెస్ట్ వాక్సినేషన్ భారత్‌లోనే ప్రారంభమవుతుందన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని, హెల్త్ వర్కర్స్ కూడా అపోహతో ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ సురక్షితమని.. ఎలాంటి ప్రమాదం కలగదని భరోసా ఇచ్చారు.

Related posts