telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం మాస్కు పెట్టుకోకపోవడం క్షమించరాని నేరం: చంద్రబాబు

chandrababu

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

కరోనా వ్యాపిస్తున్న వేళ సీఎం మాస్కు ధరించకపోవడం క్షమించరాని నేరం అని అన్నారు. ప్రధాని, పొరుగు రాష్ట్రాల సీఎంలే మాస్కు ధరిస్తున్నారని చ్చెప్పారు. మన రాష్ట్రంలో సీఎం, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాడు బిగించడం హేయమని పేర్కొన్నారు. వైసీపీ దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు.

పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్టానికి చెడ్డపేరు తెచ్చారని అన్నారు. కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం వైసీపీకి ఇష్టం లేదని తెలిపారు. వైసీపీ బెదిరింపుల కారణంగానే కియా 17 యూనిట్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చంద్రబాబు ఆరోపించారు.

Related posts