telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కియాలో ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

కియా పరిశ్రమలో తమకే ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పులివెందుల పంచాయితీ పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కరువు జిల్లాకు కియా పరిశ్రమ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.

కియా పెడతామని వైఎస్‌కు ఎప్పుడో చెప్పారంటా! మా నాన్న కల నెరవేర్చానని సీఎం జగన్‌ చెబుతున్నారు. 2009లో చనిపోయిన వైఎస్‌కు.. రెండేళ్ల క్రితం వచ్చిన కియాకు సంబంధమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇసుక కొరత లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇసుక ఎందుకు దొరకటం లేదని, ధర ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

Related posts