telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

టీచర్‌ పోస్టుల భర్తీపై  తెలుగు రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

supreme court two children petition
ఫిబ్రవరి చివరి నాటికి టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల నియామకాల్లో జాప్యం జరుగుతుందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. 
అయితే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా కొన్ని పోస్టులకు మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి చివరినాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది.

Related posts