telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బయట నుంచి వచ్చిన వాళ్లు ఇక వెళ్ళిపోవాలి…

జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది… దీంతో.. సాయంత్రం 6 గంటలకే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిపిలివేశాయి.. ఇక, గ్రేటర్ ఎన్నికల సమయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం… జీహెచ్ఎంసీ బయట నుంచి వచ్చిన వాళ్లు.. వెంటనే హైదరాబాద్‌ను విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది… ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లి పోవాలని సూచించిన ఎన్నికల సంఘం… పోటీ చేస్తున్న వ్యక్తికి ఒకే వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఏజెంట్లకు ప్రత్యేకంగా వాహనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అభ్యర్థి వాహనంలోనే ఏజెంట్లు ప్రయాణం చేయొచ్చని సూచించింది. మరోవైపు.. ఇవాళ సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు క్లోజ్ కాగా.. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది ఈసీ… ఇక, ఓటు వేయడానికి వెళ్లే వాళ్లకు అన్ని సంస్థలు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది‌.

Related posts