నేడు నిర్మలాసీతారాం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్లో కొన్ని మార్పులు తప్ప బడ్జెట్లో కొత్తగా ఏమీ లేదని అభిప్రాయపడుతూ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగినా ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలూ ప్రతిపాదించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల్ని మభ్యపెట్టేలా ప్రధాని మోదీని ప్రశంసించడం తప్ప ఈ బడ్జెట్ ప్రసంగంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రాలకు పన్నుల పంపిణీపై ఆర్థికమంత్రి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదన్నారు. పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. 2014-15 నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతోందనీ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా అమలు కావడంలేదన్నారు. తెరాస ప్రభుత్వం సమర్థంగా పనిచేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన వాటా కోరుతూ కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఉత్తమ్ చెప్పారు.
నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉన్న నిరుద్యోగం పెరగడంపై బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదని ఉత్తమ్ విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి చర్యలను ప్రతిపాదించలేదని ఆయన అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్లు ప్రస్తావించలేదన్నారు. మరోవైపు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఉత్తమ్ ప్రశ్నించారు. వివిధ కారణాల వల్ల, వేలాది మంది రైతులు ఆత్మహత్యకు కారణాల వల్ల బాధపడుతున్న కోటి మంది రైతుల గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు.