telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కరోనా అప్డేట్‌

ఏపీలో గడచిన 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,179 మందికి పాజిటివ్ గా తేలింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 192 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 167, పశ్చిమ గోదావరి జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.

అదే సమయంలో 1,651 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,089కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,40,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,12,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,905 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts